Nara Lokesh: త‌ప్ప‌కుండా రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా

నారా లోకేష్ (nara lokesh) రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్మును (draupadi murmu) క‌లిసారు. త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ విష‌యాన్ని రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లారు. లోకేష్‌తో పాటు నేత‌లు లోకేష్ వెంట కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. 2019 నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష పార్టీల గొంతు ఎలా నొక్కేస్తోందో రాష్ట్ర‌ప‌తికి వివ‌రించామ‌ని.. త్వ‌ర‌లో రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌కుండా ఇస్తాన‌ని తెలిపారు. అస‌లు అమ‌రావ‌తిలో ఔట‌ర్ రింగ్ రోడ్డు లేకుండానే త‌న‌పై కేసు ఎలా వేసారో అర్థంకావ‌డంలేద‌ని.. సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే వాటిపై కూడా కేసులు వేసి వేధిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.