ప‌ప్పు అనుకుంటివా.. నిప్పు..!

Nara Lokesh creates sensation by breaking record in mangalagiri

Nara Lokesh: మాట్లాడితే ప‌ప్పు ప‌ప్పు అని తెగ హేళ‌న చేసేవారు. ఆ కూత కూసిన‌వారంద‌రికీ.. నిప్పుగా మారి వాత‌పెట్టి మ‌రీ ఇంటికి పంపించాడు నారా లోకేష్‌. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన లోకేష్ అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ విజ‌యం ఎంతో ప్ర‌త్యేకం అని చెప్పుకోవాలి. గ‌త ఎన్నిక‌ల్లో కూడా లోకేష్ ఇక్క‌డి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన చోటే గ‌ట్టిగా నిల‌బ‌డి గెలిచి తీర‌తాన‌ని శ‌ప‌థం చేసి మ‌రీ పోటీ చేసారు. చివ‌రికి గెలిచి చూపించారు.

చివ‌రి సారిగా తెలుగు దేశం పార్టీ మంగ‌ళ‌గిరిలో గెలిచింది 1985లోనే. ఆ త‌ర్వాత ఒక్క‌సారి కూడా మంగ‌ళ‌గిరిలో ప‌చ్చ జెండా ఎగ‌రేయ‌లేదు. అలాంటి సీటుని ప‌ట్టుకుని విడ‌వ‌కుండా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా లోకేష్ గెలిచి చూపించి నేత‌ల్లో స్ఫూర్తిని నింపారు.