AP Assembly: త‌ల్లికి వంద‌నం స్కీంపై నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు

nara lokesh clarity on thalliki vandanam scheme

AP Assembly: త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ స‌మావేశంలో ఆయ‌న ఈ ప‌థ‌కంపై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను ఖండించారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ మేనిఫెస్టోలో పెట్టిన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని.. తాను ముందు నుంచీ చెప్తున్న‌ట్లు ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంతమందికీ ఒక్కొక్క‌ళ్ల‌కి రూ.15000 ఇచ్చి తీర‌తామ‌ని ఇక ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పారు.