Nara Bhuvaneshwari: విజయవాడ కనకదుర్గమ్మ ఆల‌యంలో భువ‌నేశ్వ‌రి

TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneshwari) విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యానికి బ‌య‌లుదేరారు. చంద్ర‌బాబు అరెస్ట్ అయిన నేప‌థ్యంలో త‌న భ‌ర్త నిర్దోషిగా బ‌య‌ట‌కు రావాలని ఆమె అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్తున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం భువ‌నేశ్వ‌రి త‌న భ‌ర్త చంద్ర‌బాబు అరెస్ట్ గురించి మాట్లాడారు. క‌క్ష సాధింపు చ‌ర్య‌గానే త‌న భ‌ర్త‌ను అరెస్ట్ చేయించార‌ని అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల కోసం చంద్రబాబు ఊరూరా తిరుగుతుంటే.. సీఎం మాత్రం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారని మండిప‌డ్డారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుని గెలిపించుకుని ఏపీని నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంచాల‌ని భువ‌నేశ్వ‌రి పిలుపునిచ్చారు.