కిడ్నాప్ చేసి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించి…

Telangana Elections: నాగ‌ర్ క‌ర్నూల్‌లో (nagar kurnool) కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. వెంక‌టాపూర్ గ్రామానికి చెందిన‌ BRS కార్య‌క‌ర్త యాదగిరిని మ‌భ్య‌పెట్టి కిడ్నాప్ చేయించి మ‌రీ రేవంత్ రెడ్డితో (revanth reddy) పార్టీ కండువా క‌ప్పించారు. దాంతో అత‌ను పోలీసులను ఆశ్ర‌యించారు. మాజీ వ్యవసాయ కమిటీ ఛైర్మ‌న్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి కలిసి త‌న‌ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కలిసొద్దాం అని కారులో ఎక్కించుకొని రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.