Naga Babu: ప‌సుపు రాసుకో జ‌గ‌న్.. ఇంత డ్రామా ఎందుకు?

Naga Babu: త‌ల‌కు దెబ్బ త‌గిలితే ప‌సుపు రాసుకోకుండా ఇంత డ్రామాలు ఎందుకు జ‌గ‌న్ అని చుర‌క‌లు అంటించారు జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ బాబు.  మొన్న శ‌నివారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌గ‌న్‌పై రాళ్లు రువ్విన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో జ‌గ‌న్ ఎడ‌మ కంటి పై భాగంలో దెబ్బ త‌గిలి ర‌క్తస్రావం అయ్యింది. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం జ‌గ‌న్ మ‌ళ్లీ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. త‌న‌పై దాడులు చేస్తున్నారంటే వారికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది అని జ‌గ‌న్ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

దీనిపై నాగ‌బాబు స్పందిస్తూ.. “” దెబ్బ తగిలిన‌ప్పుడు ప‌సుపు రాసుకుంటే పోయేదానికి ఇన్ని డ్రామాలు ఎందుకు జ‌గ‌న్? ఈ సింప‌తీల‌తోనే మీ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచింది. ఇప్పుడు కూడా గెలుస్తుంది అనుకుంటే అది నీ పొర‌పాటు. మొన్న మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఇలాంటి సింప‌తీ కోస‌మే ప్ర‌య‌త్నించారు. ఇలాంటి డ్రామాలు కొంద‌రికి ప‌నిచేస్తాయి. కొంద‌రికి ప‌నిచేయ‌వు. పోయిన‌వారి మీకు ప‌నిచేసింది కాబ‌ట్టి గెలిచారు. ఇప్పుడు మాత్రం ఇలాంటి డ్రామాలు న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేరు. వివేకా హ‌త్య కేసులో న్యాయం కోసం చెల్లి పోరాడుతుంటే నీకు సింప‌తీ లేదు. వేలాది మంది మ‌హిళ‌లు అదృశ్యం అయిపోతుంటే సింప‌తీ రాదు. ఎందుక‌య్యా ఇన్ని డ్రామాలు “” అని ప్ర‌శ్నించారు నాగ‌బాబు.