Mynampally Rohit: తాత ముత్తాత‌లు వ‌చ్చినా న‌న్ను, నాన్న‌ను ఏమీ పీక‌లేరు

Mynampally Rohit: కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్.. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డికి (Malla Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌ల్లారెడ్డికి చెందిన అగ్రిక‌ల్చ‌ర‌ల్ కాలేజీలో దాదాపు 20 మంది విద్యార్ధుల‌ను డీటైన్ చేసారు. వారు వ‌రుస‌గా ఐదు సార్లు ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవుతుండడంతో డీటైన్ చేయాల్సి వ‌చ్చింద‌ని మ‌ల్లారెడ్డి కోడ‌లు ప్రీతి రెడ్డి ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే మాకు న్యాయం చేయండి అంటూ ఆ డీటైన్ అయిన విద్యార్ధులు మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, మైనంప‌ల్లి రోహిత్‌ల‌ను ఆశ్రయించారు. దాంతో హ‌నుమంత‌రావు త‌న కార్య‌క‌ర్త‌ల‌ను, విద్యార్ధుల‌ను కాలేజీకి తీసుకెళ్లి మ‌ల్లారెడ్డి ఫోటోను.. ఇత‌ర సామాగ్రికి నిప్పు పెట్టించి నినాదాలు చేసారు.

ఈ నేప‌థ్యంలో మైనంప‌ల్లి రోహిత్ జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్పందించారు. విద్యార్ధులే సాయం కోసం త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని.. ఫీజులు క‌ట్టించుకుని డీటైన్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. మ‌ల్లారెడ్డే కాదు ఆయ‌న తాత ముత్తాత‌లు వ‌చ్చినా త‌న‌ను, త‌న తండ్రిని కొన‌లేర‌ని.. విద్యార్ధుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ: Preethi Reddy: మైనంప‌ల్లి.. ఇది క‌రెక్ట్ కాదు