Telangana: మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి విక్ర‌మ్ గౌడ్

Telangana: ముఖేష్ గౌడ్ (mukesh goud) కుమారుడు విక్ర‌మ్ గౌడ్ (vikram goud) మ‌ళ్లీ కాంగ్రెస్ (congress) గూటికి చేర‌నున్నారు. కాంగ్రెస్ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి  (BJP) జంప్ అయిన విక్ర‌మ్ గౌడ్ గోషామ‌హ‌ల్ సీటు ఆశించ‌గా అందుకు BJP ఒప్పుకోలేదు. దాంతో త‌న‌కు పార్టీలో స‌రైన గౌర‌వం ద‌క్క‌డంలేద‌ని విచారం వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో భేటీ అయ్యారు. వారం రోజుల్లో కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.