Mudragada: YSRCPలోకి వెళ్తున్నా.. ప‌ద‌వులు వ‌ద్దు

Mudragada: కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం YSRCPలో చేరనున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈనెల 14న YSRCP కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలిపారు. జ‌న‌సేన (Janasena) ఎవ్వ‌రితోనూ పొత్తు పెట్టుకోక‌పోయి ఉంటే అదే పార్టీలో చేరేవాడిన‌ని.. కానీ తెలుగు దేశం (Telugu Desam Party), భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో (Bharatiya Janata Party) పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో త‌న‌కు జ‌న‌సేన‌పై న‌మ్మ‌కం పోయింద‌ని అన్నారు. త‌న‌తో పాటు త‌న కుమారుడు గిరి కూడా YCPలోనే చేర‌తాడ‌ని.. తాను ఎలాంటి ప‌ద‌వులు ఆశించ‌డంలేద‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కోసం ఎన్నిక‌ల ప్రచారంలో త‌న వంతు సాయం చేస్తాన‌ని వెల్ల‌డించారు.