Mudragada: ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే నా పేరుకు రెడ్డి త‌గిలించుకుంటా

Mudragada: కాపు సంఘ అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (Pawan Kalyan) మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి తిట్ట‌డానికి అన్న‌ట్లు ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌వ‌న్ మాట్లాడితే డ్ర‌గ్స్, గంజాయి అంటున్నాడ‌ని.. అత‌నేమ‌న్నా గంజాయి ముఠాలకు నాయ‌క‌త్వం వ‌హించారా అని ప్ర‌శ్నించారు. లేక‌పోతే అంత క‌చ్చితంగా గంజాయి గురించి ఎలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. పిఠాపురంలో ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే త‌న పేరును ప‌ద్మ‌నాభ రెడ్డిగా మార్చుకుంటాన‌ని స‌వాల్ విసిరారు.