ప‌వ‌న్ గెలిచారు.. నా పేరు మార్చుకోవ‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను

Mudragada Padmanabham says he registered for new name

Mudragada Padmanabham: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలిస్తే త‌న పేరును ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డి అని మార్చుకుంటాన‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేసారు ముద్ర‌గ‌డ‌. తీరా చూస్తే.. జ‌న‌సేన 23కి 23 క్లీన్ స్వీప్ చేసేసింది. దాంతో ముఖం ఎక్క‌డ పెట్టుకోవాలో కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు అర్థంకావ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ మీడియా ముందు ప్ర‌త్య‌క్షమ‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాను విసిరిన స‌వాల్ ప్ర‌కారం త‌న పేరును ప‌ద్మ‌నాభ రెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా జ‌రిగాయ‌ని తెలిపారు.