Mudragada: ప‌వ‌న్ గారూ నేను అమ్ముడుపోయా.. న‌న్ను చంపించేయండి

Mudragada padmanabham request to pawan kalyan

Mudragada: మొత్తానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌వాల్ విసిరిన కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం త‌న పేరును ముద్ర‌గ‌డ పద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతార‌ని.. ఆయ‌న గెలిస్తే త‌న పేరుకు రెడ్డి అని త‌గిలించుకుంటాన‌ని ఓవ‌రాక్ష‌న్ చేసి ఛాలెంజ్ చేసారు. తీరా చూస్తే జ‌న‌సేన 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెల‌వ‌డంతో ముద్ర‌గ‌డ షాక‌య్యారు. ముద్ర‌గ‌డ చేసిన స‌వాల్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్టించుకోలేదు కానీ.. ముద్ర‌గ‌డ మాత్రం సీరియ‌స్‌గా తీసుకుని త‌న పేరును మార్పించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి గెజిట్ నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ అయ్యింది.

అయితే ఇప్పుడు ముద్ర‌గ‌డ‌కు త‌న తప్పు తెలిసిన‌ట్లుంది. ప‌వ‌న్‌కు లేని పోని స‌ల‌హాలు ఇచ్చి లేఖ‌లు రాసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన ముద్ర‌గ‌డ ఇప్పుడేమో తాను అమ్ముడుపోయిన మాట నిజ‌మేన‌ని మీడియా ముందు ఒప్పుకున్నారు. “” ప‌వ‌న్ గారూ మీరు చెప్పిన‌ట్లుగానే నేను అమ్ముడుపోయాను. చేత‌కాని వాడిని. ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది. మీ చేతుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.. మీరు కాపుల కోరికను నెరవేర్చండి పవన్ గారు. మమల్ని తిట్టించడం మానేసి… మనుషులని పంపి మా కుటుంబసభ్యులను చంపించెయ్యండి “” అనిషాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు.