EXCLUSIVE: “స‌జ్జ‌ల‌.. నా ద‌గ్గ‌రికి ఎవ్వ‌రినీ పంప‌కు”

EXCLUSIVE: ముద్ర‌గ‌డ పద్మ‌నాభం (mudragada padmanabham) జ‌న‌సేన‌లో (janasena) క‌లుస్తారు అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ విప్ స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఆయ‌న‌తో ఫోన్ మాట్లాడారు. ముద్ర‌గ‌డ‌తో మంత‌నాలు జ‌రిపేందుకు YSRCP నుంచి తోట త్రిమూర్తులు ముద్ర‌గ‌డ ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఈ విష‌యం తెలిసి ముద్ర‌గ‌డ ముందే స‌జ్జ‌ల‌తో ఫోన్‌లో మాట్లాడ‌టం ద్వారా తోట త్రిమూర్తులు ముద్ర‌గ‌డ భేటీ ఆగిపోయింది. సజ్జ‌లతో ముద్ర‌గ‌డ సంభాషిస్తూ త‌న వ‌ద్ద‌కు ఎవ్వ‌రినీ పంపొద్ద‌ని కోరారు. దీనిని బట్టి చూస్తే ముద్ర‌గ‌డ మ‌న‌సు మార్చుకునేలా లేరని తెలుస్తోంది. ఆయ‌న ఫోక‌స్ అంతా జ‌న‌సేన‌పైనే ఉన్న‌ట్లు అనుచరులు చెప్తున్నారు.