Jagan: అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని మోదీ, అమిత్ షా.. తిరిగొచ్చేసిన జ‌గ‌న్

modi and amit shah did not give appointment to jagan

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం అరాచ‌కాల‌కు పాల్ప‌డుతోందంటూ నిన్న ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌ర్నా చేప‌ట్టారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఇండియా కూట‌మికి చెందిన 8 పార్టీ అధినేత‌లు మ‌ద్ద‌తు తెలిపారు. అయితే జ‌గ‌న్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర‌మంత్రి అమిత్ షాల నుంచి అపాయింట్‌మెంట్ కోరిన‌ప్ప‌టికీ వారు ఇవ్వ‌లేదు. దాంతో ఈరోజు వారితో చ‌ర్చించాల్సిన జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోయే స‌రికి తిరిగి గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. జ‌గ‌న్‌తో పాటు మార్గాని భ‌ర‌త్, అవినాష్ రెడ్డి, విజ‌య‌సాయి రెడ్డిలు కూడా ఉన్నారు.