Pothula Sunitha: జ‌న‌సేన కాదు చంద్ర‌సేన‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి (pawan kalyan)మ‌హిళ‌ల గురించి మాట్లాడే హక్కులేద‌ని అన్నారు YSRCP ఎమ్మెల్సీ పోతుల సునీత (pothula sunitha). జ‌నసేన పార్టీని (janasena) పెట్టి ప‌దేళ్లు అవుతున్నా కూడా ఆయ‌న‌కు రాజ‌కీయంలో ఇంకా మెచ్యూరిటీ రాలేద‌ని అన్నారు. వాలంటీర్ల గురించి త‌ప్పుగా మాట్లాడుతున్న ప‌వ‌న్ ప‌ట్ల ఆడ‌వాళ్లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలోని ఆడ‌వాళ్ల ప‌ట్ల కూడా ఆయ‌న‌కు గౌర‌వం లేద‌ని ఆరోపించారు. జన‌సేన పార్టీని ఇక నుంచి చంద్ర‌సేన పార్టీ అని పిలిస్తే బాగుంటుంద‌ని, చంద్ర‌బాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ల‌నే ప‌వ‌న్ చ‌దువుతున్నార‌ని తెలిపారు. (pothula sunitha)

ప‌వ‌న్ కాపు (kapu community) వ‌ర్గాన్ని మోసం చేస్తున్నార‌ని త్వ‌ర‌లో కాపులు ప‌వ‌న్‌ను మోస‌గాడు అని పిలిచే రోజులు వ‌స్తాయ‌ని విమ‌ర్శించారు. 2024లో 174 సీట్లు గెలుస్తుంద‌ని రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల వారి స‌పోర్ట్ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డికే (jagan mohan reddy) ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు.