Old Parliament: 96 ఏళ్ల బిల్డింగ్.. గుర్తుగా మంత్రుల సెల్ఫీ..!

96 ఏళ్ల చ‌రిత్ర ఉన్న దేశ రాజ‌ధాని ఢిల్లీలోని పాత పార్ల‌మెంట్ (old parliament) బిల్డింగ్‌కు ఇక గుడ్‌బై చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంది. ఈరోజు నుంచి కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోనే స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) తెలిపారు. పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలోని సెంట్ర‌ల్ హాలులో చిన్న పాటి స‌మావేశాన్ని ఏర్పాటుచేసి ఇక ఈ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి స్వ‌స్తి ప‌లుకుతారు. 1927లో ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తయింది. ఇప్ప‌టివ‌ర‌కు పార్ల‌మెంట్‌లో జ‌ర‌గాల్సిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను క‌ళ్లారా చూసింది ఈ భ‌వ‌నం. దీనికి స్వ‌స్తి ప‌లుకుతున్న నేప‌థ్యంలో మోదీ పార్ల‌మెంట్‌లోని ప్ర‌తి ఇటుక‌కు నివాళులు అర్పించారు.