Konda Surekha: మంత్రికి చేదు అనుభ‌వం

Konda Surekha: మంత్రి కొండా సురేఖ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. కోమురవెళ్లి మల్లన్న కళ్యాణంలో పాల్గొని తిరుగు ప్రయాణం అవుతున్న స‌మ‌యంలో కాన్వాయ్ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. స్వామి వారి కళ్యాణం ముగించుకుని బయలుదేరుతున్న సమయంలో కాన్వాయ్ రాకపోవడంతో కొండా సురేఖ‌కు ఒళ్లుమండింది. దాంతో ఆమె తన సోంత వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.