Balakrishna ఒక ఎద‌వ‌: మంత్రి జోగి ర‌మేష్ షాకింగ్ కామెంట్స్

Hyderabad: వైసీపీ(ycp) నేత జోగి ర‌మేష్(jogi ramesh) చేసిన కామెంట్లు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. టీడీపీ(tdp) అధినేత చంద్ర‌బాబు నాయుడు(chandrababu), ఎమ్మెల్యే బాల‌కృష్ణ(balakrishna), న‌టుడు ర‌జినీకాంత్(rajinikanth) గురించి ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మొన్న కృష్ణా జిల్లాలో జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు బాల‌య్య‌.. ర‌జినీకాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఏపీకీ చంద్ర‌బాబు సీఎం అయితేనే అభివృద్ధి అంటూ టీడీపీకి స‌పోర్ట్ చేస్తూ మాట్లాడారు. దాంతో ర‌జినీకాంత్‌పై వైసీపీ నేత‌లు దారుణమైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. “ర‌జినీకాంత్ ఏ ముఖం పెట్టుకుని వ‌చ్చాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ చావుకు ర‌జినీకాంత్ కూడా ఒక కార‌ణ‌మే. అన్నీ ప్లాన్ చేసే చంద్ర‌బాబుతో క‌లిసి ఆయ‌న్ని చంపేసారు. సిగ్గుండాలి. ఆ బాల‌కృష్ణ ఒక ఎద‌వ‌. తండ్రిని చంపిన‌వాళ్ల‌ను ప‌క్క‌న‌పెట్టుకున్నారు. అస‌లు ఏం మ‌నుషులురా మీరు. అస‌లు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా పుట్టార్రా మీరు” అంటూ నోటికొచ్చిన‌ట్లు కామెంట్స్ చేసారు. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు కొడాలి నాని, రోజా కూడా రజినీకాంత్ గురించి త‌ప్పుడు వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే.