KA Paul: తార‌క‌ర‌త్న మృతిపై అనుమానాలున్నాయ్‌

Hyderabad: దివంగ‌త సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న‌పై(tarakaratna) ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసారు ప్ర‌జాశాంతి(prajashanthi) పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్(ka paul). కొంత‌కాలంగా ఆయ‌న మీడియా ముందు అన్ని పార్టీల నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. తాజాగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు గురించి మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌ళ్లీ చంద్ర‌బాబు సీఎం అయితే రాష్ట్రానికి శ‌ని ప‌ట్టుకుంటుంది అంటూ కామెంట్లు చేసారు. “జాబు కావాలంటే బాబు రావాలి అంటున్నారు. బాబు వ‌స్తే శ‌ని. మొన్న పాద‌యాత్ర‌కు తార‌క‌ర‌త్న వెళ్ల‌క‌పోయి ఉంటే ఆయ‌న బ‌తికి ఉండేవారు. ఆయ‌న చ‌నిపోయిన‌ప్పుడు ఇవ‌న్నీ మాట్లాడి రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌ని ఏడ్చి ప్రార్థ‌న చేసి వ‌చ్చేసాను. తార‌క‌ర‌త్న ఎప్పుడు చ‌నిపోయారో సీబీఐ ఎంక్వైరీ చేయాలి. ఆయ‌న చ‌నిపోయాక ఎన్ని రోజులు హాస్పిట‌ల్‌లో ఉంచారో తెలియాలి. మీకు చిత్త‌శుద్ధి ఉంటే సీబీఐ విచార‌ణ చేయించండి. తార‌క‌ర‌త్న మృతి వెనుక అనుమానాలున్నాయ్” అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసారు.