జ‌గ‌న్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

man who pelted stone on jagan gets bail

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విజ‌య‌వాడ‌లో రాళ్ల‌తో దాడి చేసిన వ్య‌క్తి స‌తీష్‌కి బెయిల్ మంజూర‌య్యింది. విజ‌య‌వాడ జిల్లా కోర్టు షర‌తుల‌తో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచార‌ణ‌కు స‌తీష్ స‌హ‌క‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేప‌డుతుండ‌గా.. విజ‌య‌వాడ‌లో కొంద‌రు ఆక‌తాయిలు జ‌గన్‌పై రాళ్ల దాడి చేసారు. ఈ ఘ‌ట‌న‌లో స‌తీష్ అనే వ్యక్తి ప్ర‌ధాన నిందితుడు. జ‌గ‌న్ ఎడ‌మ కంటి పై భాగంలో రాయి త‌గ‌ల‌డంతో అప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న‌కు డాక్ట‌ర్లు ప్ర‌థ‌మ చికిత్స చేసారు.