Malla Reddy: ఏ గొర్రెని చూసినా కేసీఆరే గుర్తొస్తున్నార‌ట‌..!

Telangana Elections: మంత్రి మ‌ల్లారెడ్డి (malla reddy) స్పీచ్‌లు ఎంత వైర‌ల్ అవుతుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు ఆయ‌న తెలంగాణ మోడ‌ల్ అని చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటూ ఉంటారు. అయితే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు (mynampally hanmanth rao) నిన్న మ‌ల్లారెడ్డిని నోటికొచ్చిన‌ట్లు ధూషించిన నేప‌థ్యంలో ఈరోజు మ‌ల్లారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మైనంప‌ల్లి గురించి కాకుండా కాంగ్రెస్ (congress) తెలంగాణ‌కు ఏమీ చేయ‌లేద‌ని KCR ప్ర‌భుత్వం వ‌చ్చాకే తెలంగాణ అభివృద్ధిలోకి వ‌చ్చింద‌ని అన్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ KCR ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్తూ మ‌ల్లారెడ్డి ఒక మాటన్నారు. అది విని అంతా న‌వ్వుకుంటున్నారు. ఇప్పుడు ప్ర‌తి రైతు, మ‌త్య్స‌కారులు అభివృద్ధి చెందారంటే అందుకు కార‌ణం కేసీఆరే అని.. ఈరోజు ఏ గొర్రెను చూసినా ఏ చేప‌ల్ని చూసినా కేసీఆరే గుర్తొస్తున్నార‌ని అన్నారు. అంటే KCR హ‌యాంలో గొర్రెల కాప‌రి వాడి ద‌గ్గ‌రి నుంచి చేప‌లు అమ్ముకునేవారి వ‌ర‌కు అంతా బాగుప‌డ్డార‌ని ఆయ‌న ఉద్దేశం. కానీ ఆయ‌న ఇలా గొర్రెను చూస్తే KCR గుర్తొస్తున్నార‌ని అన‌డం వైర‌ల్‌గా మారింది. (malla reddy)