Chandrababu Naidu: తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

major accident averted for chandrababu naidu

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన నేప‌థ్యంలో ఆయ‌న అక్క‌డే ప‌ర్య‌టిస్తున్నారు. ఈరోజు సాయంత్రం స్థానిక మ‌ధురా న‌గ‌ర్, దేవిన‌గ‌ర్ ప్రాంతాల్లో బాబు ప‌ర్య‌టించారు. వ‌ర‌ద‌ల‌కు కార‌ణమైన బుడ‌మేరు కాలువ అక్క‌డి రైల్వే ట్రాక్ కింద నుంచి పారుతోంద‌ని దానిని ప‌రిశీలించేందుకు వెళ్లారు. ఆయ‌న రైల్వే బ్రిడ్జ్ ట్రాక్‌పై నిల‌బ‌డి ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలోనే రైలు వ‌చ్చేసింది. కూత‌వేటు దూరం నుంచి రైలు రావ‌డాన్ని గ‌మ‌నించిన సెక్యూరిటీ బ‌ల‌గాలు చంద్ర‌బాబును వెంట‌నే ప‌క్క‌నే ఉన్న ర్యాంప్ మీద‌కు తీసుకెళ్లారు. రైలు వెళ్లేవ‌ర‌కు చంద్ర‌బాబు ర్యాంప్ పైనే ఉన్నారు.