Hyderabad: షాకింగ్.. ఒవైసీపై మాధ‌వీల‌త ఆధిక్యం

madhavi latha leading against asaduddin owaisi

Hyderabad: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా హైద‌రాబాద్‌లో ఎప్ప‌టినుంచో ఎంపీగా గెలుస్తూ వ‌చ్చిన AIMIM అధినేత అసదుద్దిన్ ఒవైసీకి ఈసారి షాక్ త‌గిలేలా ఉంది. ఈసారి హైద‌రాబాద్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్టీ నుంచి విరించి హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ మాధ‌వీ ల‌త ఎంపీగా బ‌రిలోకి దిగారు. ఇప్పుడు జ‌రుగుతున్న కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఆమె ముందంజ‌లో ఉన్నారు. చూడ‌బోతే.. ఎప్ప‌టినుంచో ఒవైసీ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న హైద‌రాబాద్‌.. ఈసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌శం అయ్యేలా ఉంది.