Lakshmi Parvathi: ప‌వ‌న్‌.. TDPతో వ‌ద్దు నీకే న‌ష్టం

Hyderabad: YCP నేత ల‌క్ష్మీ పార్వ‌తి (lakshmi parvathi).. జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) హెచ్చరించారు. రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్.. TDPతో పొత్తు పెట్టుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ల‌క్ష్మీ పార్వ‌తి స్పందించారు. TDP లాంటి విష‌పు వృక్షంతో పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన‌కే (janasena) న‌ష్ట‌మ‌ని, ఒంట‌రిగా పోటీ చేస్తేనే మంచిద‌ని అన్నారు. “ప‌వ‌న్ అంటే నాకు ఎప్పుడు సానుభూతి ఉంది. నువ్వు సినిమా రంగంలో రారాజువి. నీకు అంతగా రాజకీయాలు చెయ్యాలనుకుంటే ఇండిపెండెంట్‌గా ఎదుగు. విష వృక్షపు నీడలో ఉండొద్దు, దాని ప్రభావం నీ మీద పడుతుంది. చంద్ర‌బాబు నాయుడు లోకేష్‌ను అంద‌రి ముందు హీరోను చేయ‌డం కోసం పాపం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వాడుకుంటున్నాడు. అన‌వ‌స‌రంగా ప‌వ‌న్‌ను తీసుకొచ్చి అత‌నిచేతే ఇత‌రుల‌ను తిట్టిస్తుంటే కాపునాయ‌కులు బాధ‌ప‌డుతున్నారు. ఈ కుట్ర‌పూరిత‌మైన రాజ‌కీయాలు వ‌ద్దు. పొత్తులు పెట్టుకుంటే చివ‌రికి బానిస అయిపోతావు. పుట్ట‌గానే దేవాన్ష్‌కి రూ.20 కోట్లు ఆదాయం ఉంద‌ట‌. నేను NTR భార్య‌ని. నాకు ఈరోజు రూ.2 కోట్లు కావాలంటే ఎటు వెళ్లాలో తెలీదు కానీ లోకేష్ మాత్రం త‌న కొడుక్కి అప్పుడే రూ.20 కోట్లు తెచ్చిపెట్టేసాడు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ల‌క్ష్మీ పార్వ‌తి.