NTR న‌న్ను ఉంచుకుంటే.. ల‌క్ష్మీపార్వ‌తి కామెంట్స్

దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు (NTR) శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ముద్రించిన రూ.100 కాయిన్‌ని ఈరోజు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (draupadi murmu) విడుద‌ల చేసారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న స‌తీమ‌ణి అయిన త‌న‌ను మాత్రం పిల‌వలేద‌ని ల‌క్ష్మీ పార్వ‌తి (lakshmi parvathi) ఆవేద‌న వ్య‌క్తం చేసారు. మాట్లాడితే.. త‌న‌ను NTR ఉంచుకున్నార‌ని అంటుంటార‌ని.. నిజంగా NTR త‌న‌ను ఉంచుకున్న‌ట్లైతే ఆయ‌న్ను యుగ‌పురుషుడు అని ఎందుకు అంటార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌ని పిల‌వ‌నందుకు గానూ ప్ర‌ధాన మంత్రికి, రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసాన‌ని వెల్ల‌డించారు.