Lakshmi Parvathi: తండ్రి చావాల‌ని భువ‌నేశ్వ‌రి క్షుద్ర‌పూజ‌లు చేయించింది

త‌న భ‌ర్త చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌కు నిర‌స‌న‌గా రాజ‌మండ్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నారా భువ‌నేశ్వ‌రిపై (nara bhuvaneswari) మండిప‌డ్డారు నేత దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు (ntr) రెండో స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి (lakshmi parvathi).

“” తండ్రి చావాల‌ని.. త‌న భ‌ర్త సీఎం అవ్వాల‌ని క్షుద్రపూజ‌లు చేయించిన భువ‌నేశ్వ‌రి ఈ రోజు నా తండ్రి లాంటి నీతిమంతుడు అని ఆయ‌న పేరుపై ట్వీట్లు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్ట‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. అస‌లు బ‌స‌వ‌తార‌కం అమ్మగారు చ‌నిపోయినప్పుడు రామారావు గారిని ఒంటరిగా వ‌దిలేసారు. ఒక్క‌సారి కూడా చూడ‌టానికి రాలేదు. తోడు కోసం ఆయ‌న న‌న్ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు క‌నీసం ఆయ‌న గురించి ప‌ట్టించుకున్న‌ది లేదు. అస‌లు రామారావు లాంటి మంచి మ‌నిషికి మీలాంటి పిల్ల‌లు ఎలా పుట్టారో అర్థంకావ‌డంలేదు. ఆయ‌నకు మీరు పిల్ల‌లు మాత్ర‌మే. వార‌సులు ఎప్ప‌టికీ కాలేరు. మాట్లాడితే ఐటీని తీసుకొచ్చింది నేనే అంటాడు చంద్ర‌బాబు. హైటెక్ సిటీ ద‌గ్గ‌ర ఓ బిల్డింగ్ క‌ట్టించి ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న భూమిని ఆక్ర‌మించేసుకున్నాడు. అవినీతి ప‌రుడైన భ‌ర్త‌తో అవినీతి ప‌రుడైన బిడ్డ‌ను క‌న్న నువ్వు ఈరోజు నీ తండ్రి పేరు అడ్డం పెట్టుకుని దీక్ష‌లు చేస్తున్నావంటే నిన్ను ఏమ‌నాలో అర్థంకావ‌డంలేదు “” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు ల‌క్ష్మీ పార్వ‌తి. (lakshmi parvathi)