KTR: క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు థ్యాంక్స్

Hyderabad: క‌ర్ణాట‌క(karnataka) ప్ర‌జ‌ల‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్(ktr) థ్యాంక్స్ చెప్పారు. ఆ రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ స్పందించారు. నీచ‌మైన‌, విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌ను తిర‌స్క‌రించిన క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు థ్యాంక్స్ అని ట్వీట్ చేసారు. ఇక‌పోతే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఎఫెక్ట్ తెలంగాణ‌పై ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసారు. క‌ర్ణాటక ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ది కేర‌ళ స్టోరీ ఎలా ఫెయిలైందో తెలంగాణ‌లోనూ అంతే అవుతుంద‌ని అన్నారు.