Congress నోట..రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక

Hyderabad: రైతుల‌కు 8 గంట‌ల ఉచిత క‌రెంట్ దండ‌గ అని TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తానా స‌భ‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రైతుల‌కు అన్ని గంట‌ల ఉచిత క‌రెంట్ అవ‌స‌రం లేద‌ని, 3 గంట‌లు ఇస్తే స‌రిపోతుంద‌ని అన‌డంతో కాంగ్రెస్ (congress) వ‌ర్గాలు కూడా మండిప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి KTR దొరికిందే సందు అన్న‌ట్లు రేవంత్‌పై కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేసారు.

కాంగ్రెస్ నోట..
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!

కాంగ్రెస్ వస్తే…
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..

నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు

మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..
ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే

కాంగ్రెస్ కు ఎప్పుడూ..
చిన్నకారు రైతు అంటే చిన్నచూపు
సన్నకారు రైతు అంటే సవతిప్రేమ

నోట్లు తప్ప… రైతుల పాట్లు
తెల్వని రాబందును నమ్మితే
రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం..
అన్నదాత నిండా మునుగుడు పక్కా..

నాడు..ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్

నేడు.. ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది

మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే
బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి…

అరికాలిలో మెదడు ఉన్నోళ్లను
నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం…

మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే..
రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం..

తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!!

రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ?
3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ?? అని KTR ట్వీట్ చేసారు.