KTR: ఏపీలో కేతిరెడ్డి ఓడిపోవ‌డ‌మేంటి.. జ‌గ‌న్‌కు 40 శాతం ఓట్లేంటి?

KTR sensational comments on jagan and sharmila

KTR: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోవ‌డంపై షాకింగ్ కామెంట్స్ చేసారు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్ర‌జ‌ల‌కు ఎన్నో ప‌థ‌కాలు ఇచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి 40 శాతం ఓట్లు రావ‌డం ఏంటి? ఎప్పుడూ ప్ర‌జ‌ల మ‌ధ్యే తిరిగే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ఓడిపోవ‌డం ఏంటి? ష‌ర్మిళ‌ను జ‌గ‌న్‌ను ఓడించేందుకు పావులా వాడారే త‌ప్ప అంత‌కుమించి ష‌ర్మిళ‌కు ఏమీ లేదు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేరుగా పోటీ చేసి ఉంటే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవి అంటూ ఢిల్లీ మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.