KTR: కాళేశ్వ‌రం పోదాం.. కాంగ్రెసోళ్లు వ‌స్తారా?

KTR: మార్చ్ 1వ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌కటించారు భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతామ‌ని ప్ర‌క‌టించారు. దశల వారికి ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ని సందర్శిస్తామ‌ని త‌మ‌తో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకువెళ్తామ‌ని అన్నారు.

ప్రజలకు కాలేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం. మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగ‌డ‌తాం. మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. పాడైన బారాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయి. సులువుగా ఒక కాపర్ డ్యాంని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చు. మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే… అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే మేము చెప్పాము. మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. (KTR)

రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలి. కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించండి. రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేము… సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి… ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయకండి. వారి పంట పొలాలను ఎండబెట్టకండి. మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానివేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలి. మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బారాజులు కొట్టుకుపోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది.

ALSO READ: KCR మాస్ట‌ర్ ప్లాన్..!

నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారు… అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతుందని చెప్పారు. ఇది ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమే . పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండి. మీరు తప్పకుండా కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించండి. రాష్ట్ర రైతాంగంపైన మా పార్టీపైన కక్షపూరిత వైఖరి మానివేయండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులపైన… తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తిపోయాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బరాజ్ లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుంది. ఇందులో కాలేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షాకాలంలో కొట్టుకుపోవాలనే పెద్ద కుట్ర ఉంది.

ఈరోజు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాక రిపోర్టుని తప్పుపట్టారు. కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని చెప్పారు. కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇది కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి. అప్పటి కాగ్ రిపోర్ట్ విషయంలో ద్వంద ప్రమాణాలు… వేరువేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుంది… కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించండి.

ఆనాడు నది జిల్లాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారు. నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించలేక పోయినారు ఆనాటి పాలకులు. 60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గద్దర్ అన్న, సదాశివుడు లాంటి వాళ్ళు తెలంగాణ గోదారి నీళ్ల రాని గోసను ప్రజలకు వివరించి చెప్పారు. కెసిఆర్ జలసాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశారు. కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన… తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపింది. పదేళ్లపాటు నాటకాలు ఆడి జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుంది. ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదు. (KTR)

ALSO READ: Bandla Ganesh: రోజా ఒక పులుసు పాప‌

ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారు. ఆనాటి జల యజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టింది. 10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ గారు నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే… నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అని వెల్ల‌డించారు KTR.