KTR: మ‌ళ్లీ ఆ అగ్నిలో BJP, కాంగ్రెస్ ద‌హ‌న‌మైపోవాలి

2009 న‌వంబర్ 29న కరీంన‌గ‌ర్ (karimnagar) జిల్లాలోనే సీఎం KCR తెలంగాణ పోరాటానికి నాంది పలికార‌ని.. ఆనాటి అగ్ని జ్వాల‌ల కార‌ణంగానే తెలంగాణ మ‌నసొంతం అయింద‌ని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల‌ను BRS పార్టీ నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో KTR క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్‌లో గంగుల క‌మ‌లాక‌ర్‌ను (gangula kamalakar) గెలిపించాల‌ని KTR ప్ర‌జ‌ల‌ను కోరారు. 2009లో అగ్ని రాజుకుంటే తెలంగాణ ద‌క్కిన‌ట్లే.. న‌వంబ‌ర్ 30న మ‌రోసారి అగ్ని రాజుకోవాల‌ని.. ఆ అగ్నిలో కాంగ్రెస్, BJP ద‌హ‌న‌మైపోవాల‌ని అన్నారు.