KTR: మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వ‌స్తున్నారు?

Hyderabad: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ప‌ర్య‌టించ‌డానికి వ‌స్తున్నారు అని ప్ర‌శ్నించారు KTR. రేపు మోదీ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌నను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని అన్నారు. మ‌హ‌బూబాబాద్‌లోని బ‌య్యారంలో ఉక్కు కార్మాగారం పెడ‌తామ‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను, గిరిజ‌న‌ల‌ను మోసం చేసినందుకు వ‌స్తున్నారా అని KTR ప్ర‌శ్నించారు. పుణ్య కాలం అంతా అయిపోయాక తూతూమంత్రంగా వ‌చ్చి గుజ‌రాత్‌కు (gujarat) రూ.20 వేల కోట్లు ఇచ్చి తెలంగాణ‌లో (telangana) మాత్రం రూ.5 వేల కోట్లు ఏదో బిచ్చం వేసిన‌ట్లు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. మోదీ తెలంగాణ‌ను అవ‌మానించిన దుర్మార్గ‌పు ప్ర‌ధాని అని విమ‌ర్శించారు. త‌ల్లిని చంపి బిడ్డ‌ను వేరే చేసారు అని మాట్లాడిన అదే ప్ర‌ధాని తెలంగాణ‌లో ఎలా ప‌ర్య‌టించడానికి వ‌స్తారు అని అన్నారు. స‌మాజంలో మ‌తం పేరిట మంట పెట్టి ఆ మంట‌ల్లో చ‌లి కాచుకుంటున్న ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.