“KCR బ‌క్క ప్రాణి.. ఆయ‌న్ని ఓడించేందుకు ఢిల్లీ నుంచి వ‌స్తున్నారు”

Kodangal: కొడంగ‌ళ్‌లో BRS అభ్య‌ర్ధి ప‌ట్నం న‌రేందర్ రెడ్డి (patnam narender reddy) నామినేష‌న్ వేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు వ‌చ్చారు మంత్రి KTR. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ఇదే కొడంగ‌ళ్‌లో నిన్న రేవంత్ రెడ్డి (revanth reddy) నామినేషన్ వేసారు. నామినేష‌న్ వేసాక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగ‌ళ్ వ‌చ్చి న‌న్ను ఎదుర్కొనే ద‌మ్ముందా KCR అని స‌వాల్ విసిరారు. దీనిపై KTR స్పందిస్తూ.. రేవంత్ లాంటి పొట్టోడిని ఓడించేందుకు KCR అవ‌స‌రం లేద‌ని ప‌ట్నం న‌రేందర్ రెడ్డి చాల‌ని తెలిపారు.

“” KCR పాపం 50 కిలోలు ఉంటారు. బ‌క్క ప్రాణి. ఆయ‌న్ను ఓడించ‌నీకి క‌ర్ణాట‌క నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా వ‌స్తున్నారు. మాట్లాడితే రేవంత్ తెలంగాణ ఇచ్చిందే సోనియ‌మ్మ అని అంటున్నాడు. ఏదో అడ‌గ్గానే పిప్ప‌ర్‌మెంట్ ఇచ్చిన‌ట్లు ఇవ్వ‌లే. ఎంతో మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే ఇచ్చారు. తెలంగాణ ఇవ్వ‌కుండా వీపు చింత‌పండు ఐత‌ది అని బెద‌ర‌గొడితే గ‌తిలేక ఇచ్చారు. తెలంగాణ ఎవ‌డ‌బ్బ సొత్తు కాదు.

మీరు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని గెలిపిస్తే నేను KCR కాళ్లు ప‌ట్టుకుని న‌రేందర్‌కు ప్ర‌మోష‌న్ ఇప్పిస్తా. అప్పుడు మీ కొడంగ‌ళ్‌కు ఏం కావాల‌న్నా ద‌గ్గ‌రుండి మ‌రీ చేసి పెడ‌తారు. రేవంత్ లాగా అప్పుడ‌ప్పుడు వ‌చ్చేటోడి కోసం మీ ఓటును నాశ‌నం చేసుకోకండి. కాంగ్రెస్ ఒస్తే ప‌రిస్థితి ఎలా ఉంట‌దో క‌ర్ణాట‌క రైతులు చెప్తున్నారు. మ‌ళ్లీ ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ మ‌న‌కు వ‌ద్దు. మీ కొడంగ‌ళ్‌కు ఏం కావాల‌న్నా నేను ద‌గ్గ‌రుండి చేయిస్తా. మీరు కారు గుర్తుకి ఓటేసి మీ ప‌ట్నం అన్న‌ను గెలిపించుకోండి చాలు “”  అని తెలిపారు KTR