YS Sharmila: న‌న్ను చూసి KTRకు భ‌యం ప‌ట్టుకుంది

Hyderabad: త‌న ఎదుగుద‌ల చూసి KTRకు భ‌యం ప‌ట్టుకుంద‌ని అంటున్నారు YSR తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). ఈ మేర‌కు షర్మిల ట్వీట్ చేసారు. తండ్రి పేరు చెప్పుకొని KTR పదవులు అనుభవిస్తుంటే, తాను తండ్రి చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేస్తున్నాన‌ని అన్నారు. “తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కి.మీ పాదయాత్ర చేసింది వైయస్ షర్మిల రెడ్డి. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక బంది పోట్ల రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతిని ఎత్తి చూపింది షర్మిల రెడ్డి. పోడు భూముల కోసం కొట్లాడింది షర్మిల రెడ్డి. నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేసింది షర్మిల రెడ్డి. ఇలా ఒకటి కాదు.. ఎన్నో ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రజల కోసం మేం చేస్తే మీరేం చేసారు చిన్న దొర? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొంటే… మీరు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు ఆరు నెలలు మేలుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. హామీలన్నీ నెరవేరుస్తామని గప్పాలు కొడుతున్నారు.

పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 46 లక్షల పేదలకు ఇండ్లు, లక్షల ఎకరాల పోడు భూములకు,అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చాడు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే కేసీఆర్ మాత్రం ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసారు. రుణమాఫీ చేస్తానని రైతులను, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగమన్నాడు, మూడెకరాల భూమి అన్నాడు, దళిత సీఎం దళిత బంధు అన్నాడు, 12% రిజర్వేషన్ అన్నాడు ఇలా ఎన్నో మోసాలు చేసాడు.. ఇది చాలదా ఎవరు తెలంగాణ సంక్షేమం కోరుకున్న నాయకుడో,అభివృద్ధి పై ఎవరికి చిత్తశుద్ది ఉందో ప్రజలకు తెలియడానికి. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసి ఆత్మగౌరవాన్ని చంపింది మీరైతే.. పార్టీ పేరులోనే తెలంగాణను పెట్టుకొని ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. అధికార మదం తలకెక్కి చిన్న దొరకు అన్ని జోకులుగానే కనిపిస్తున్నాయి. ఎవరిది నమ్మకమో.. ఎవరు జోకర్లో వచ్చే ఎన్నికల్లో బయటపడుతుందిలే KTR గారు” అంటూ చ‌మ‌త్కారాలు విసిరారు.