KTR: రేవంత్‌ని శున‌కంతో పోల్చిన మంత్రి

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR.. ఈరోజు సీనియ‌ర్ కాంగ్రెస్ మాజీ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్యను (ponnala lakshmaiah) క‌లిసారు. ఆయ‌న ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడారు. ఆయ‌న్ను BRS పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య నుంచి స‌మాధానం రావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో KTR మీడియాతో మాట్లాడుతూ.. అంత‌టి సీనియ‌ర్ నేత‌ను నోటికొచ్చిన‌ట్లు ఎలా మాట్లాడతారంటూ TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (revanth reddy) మండిప‌డ్డారు. పోయే వ‌య‌సులో పార్టీ మారుతున్నాడు అని రేవంత్ పొన్నాల‌ను ధూషించార‌ని.. ఎవ‌రు ఎప్పుడు పోతార‌నేది ఎవ‌రికి తెలుస‌ని అన్నారు. శున‌కాన్ని అధికార అంద‌లం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది అంటూ రేవంత్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. తానైతే పొన్నాల‌ను పార్టీలోకి స‌గౌర‌వంగా ఆహ్వానించాన‌ని.. ఆయ‌న KCRతో మాట్లాడి త‌న నిర్ణ‌యాన్ని చెప్తాన‌ని అన్నార‌ని తెలిపారు.