వెన్నుపోటు పొడిచారు అంటూ కంట‌త‌డి పెట్టిన KTR

భార‌త రాష్ట్ర స‌మితికి (BRS) చెందిన నేత‌లు ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్‌కు, భార‌తీయ జ‌న‌తా పార్టీకి వెళ్లిపోతుండ‌డంతో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR కంట‌త‌డి పెట్టారు. ఈ రోజు ఓ స‌భ‌లో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా మందికి న‌మ్మి టికెట్లు ఇచ్చామ‌ని.. ఇప్పుడు అస‌లు రంగు చూపించి వెన్నుపోటు పొడిచారంటూ క‌న్నీరుపెట్టుకున్నారు. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేడు అన్న‌ట్లుగా.. త‌న పార్టీలోనే వెన్నుపోటు పొడిచే వారు ఉన్నార‌ని గుర్తించ‌లేక‌పోయామ‌ని త‌డిగుడ్డ‌తో గొంతుకోసారని చెప్పారు. క‌ష్టాల్లో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితిని ఇప్పుడు వ‌దిలిపెట్టి వెళ్తున్న నేత‌లు మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి KCR కాళ్లు ప‌ట్టుకున్నా కూడా పార్టీలో చేర్చుకోం అని తేల్చి చెప్పేసారు. KTR అలా కంట‌త‌డి పెట్టేస‌రికి.. ఇత‌ర నేత‌లు కూడా ఉద్వేగానికి లోన‌య్యారు.