KTR: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మాది భరోసా

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు భ‌రోసాగా నిలుస్తామ‌ని తెలిపారు మంత్రి KTR. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నాలుగవ తేదీన 10 గంటలకు అశోక్ నగర్‌లో యువతతో సమావేశం అవుతాన‌ని KTR మాటిచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేస్తామ‌న్నారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింతగా పెంచుతామ‌ని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామ‌ని నోటిఫికేషన్లు ఫలితాల జారీపైన ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామ‌ని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఉద్యోగం నిర్వహించిన యువకుడిగా,సోదరుడిగా యువత ఆకాంక్షలు అర్థం చేసుకోగలుగుతానని KTR అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు.