KTR: “అంత కోపం ఎందుకు భ‌ట్ట‌న్నా.. మిడిసి ప‌డ‌కండి”

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ మొద‌లైన మొద‌టి వారంలోనే ఇరు వర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే KTR మాట్లాడుతూ.. ఉన్న మాటంటే ఉలుకెందుకు ప‌డుతున్నారు అంటూ కాంగ్రెస్ నేత‌ల‌ను క‌వ్వించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏం జ‌రిగిందో మాట్లాడ‌కుండా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నార‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. దీనిపై KTR స్పందిస్తూ.. కేవ‌లం 1.70% మంది ఎక్కువ అభ్య‌ర్ధుల‌తో గెలిచినంత మాత్రాన మిడిసిప‌డ‌కండి.. అంత కోపం ఎందుకు భ‌ట్ట‌న్నా అంటూ సెటైర్ వేసారు. ఆ త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి చెడుల గురించి మాట్లాడ‌మంటే మేం అచ్చోసిన ఆంబోతుల్లా ఇలాగే ఉంటాం అంటే కుద‌ర‌దు అంటూ అమ‌ర్యాద‌క‌రంగా మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.