Venkat Reddy: ఏపీ ఎన్నిక‌ల‌పై తిరుమ‌ల‌లో వెంక‌ట్ రెడ్డి జోస్యం

komatireddy Venkat Reddy talks about ap elections winner in tirumala

Venkat Reddy: జూన్ 4న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన ఆయ‌న‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ఎన్నిక‌ల‌పై మాట్లాడారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని.. ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు చెరో స‌గం సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విష‌యంలో మాత్రం తొలిసారి ప్ర‌జ‌ల నాడి అంతుచిక్క‌కుండా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.