Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ ఓవ‌ర్‌లోడ్ అయిపోయింది

Hyderabad: ఇప్పటికే కాంగ్రెస్ (congress) పార్టీలో ఓవర్లోడ్ అయింద‌ని ఇక‌ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేద‌న్నారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (komatireddy venkat reddy). ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా నాయకులు చేరాల్సిన అవసరం లేదని, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు గాను 12 ఎమ్మెల్యే అభ్యర్దులు ఇప్పటికే రెడీగా ఉన్నారని అన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే BRS నేత వేముల వీరేశం (vemula veeresham) కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు య‌త్నిస్తున్న నేప‌థ్యంలో కోమటిరెడ్డి ఇలా మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న పార్టీలో చేర‌డాన్ని కోమ‌టిరెడ్డి వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది.