Kodali Nani: జ‌గ‌న్ ఉండ‌గా మ‌రో సీఎం రాడు..!

Kodali Nani: నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పుల‌పై స్పందించారు నేత కొడాలి నాని. బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌న్న ఉద్దేశంతోనే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై అస్స‌లు ఉండ‌ద‌ని.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది తమ ప్ర‌భుత్వ‌మేన‌ని తెలిపారు. జ‌గ‌న్ బ‌తికి ఉండ‌గా మరొక‌రు సీఎం కాలేర‌ని పేర్కొన్నారు.

ఇప్పుడున్న నియోజ‌క‌వర్గాల ఇన్‌ఛార్జిల‌ను మార్చినంత మాత్రాన వారు ఎందకూ ప‌నికిరాని వారు కాద‌ని.. కొత్త వారు వ‌చ్చినంత మాత్రాన వారేదో ఇర‌గ‌దీసేస్తార‌ని కాద‌ని.. పార్టీలో 90 శాతం మంది నేత‌లు మ‌న‌స్ఫూర్తిగా పార్టీ కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. అలిగి కొంద‌రు పార్టీలు మారితే కూడా పార్టీకి వ‌చ్చిన న‌ష్టం లేద‌ని.. జ‌గ‌న్ అన్ని కులాల వారికీ స‌మ‌న్యాయం చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ మాజీ సీఎం KCR తీసుకొచ్చిన ప‌థ‌కాలు వేరు జ‌గ‌న్ తీసుకొచ్చిన ప‌థ‌కాలు వేర‌ని.. ఆయ‌న తెచ్చిన ప‌థ‌కాల‌తోనే మ‌ళ్లీ ఆయ‌న సీఎం అవుతార‌ని పేర్కొన్నారు.