Kodali Nani: సిగ్గు లేని ఎద‌వ‌లు.. ఓడినా మాట తీరు మార‌లేదు

kodali nani calls tdp leaders as scumbags

Kodali Nani: ఓడిపోయినా ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నానికి బుద్ధి రాలేదు. అధికారంలోకి వ‌చ్చాక చిన్నా పెద్దా అని లేకుండా వాడు వీడు అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాగే నాని.. ఇప్పుడు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ మాట తీరును మార్చుకోలేదు. తెలుగు దేశం పార్టీ నేత‌లు, వారికి అనుగ‌ణంగా ప‌నిచేస్తున్న మీడియా వాళ్లంతా సిగ్గు ఎగ్గు లేని ఎద‌వ‌లంటూ వ్యాఖ్యానించారు.

రుషికొండ‌పై క‌ట్టించిన భ‌వ‌నాలు విశాఖ‌ను అంత‌ర్జాతీయ రాజ‌ధానిగా చేసేందుకే అని.. ప్ర‌భుత్వం భ‌వ‌నాల్లో నివ‌సించాల‌న్న ఆశ కానీ కోరిక కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ర‌క్తంలోనే లేవ‌ని నాని అన్నారు. కానీ సిగ్గు ఎగ్గు లేని తెలుగు దేశం పార్టీ ఎద‌వ‌లు అది జ‌గ‌న్ క‌ట్టించుకున్న భ‌వ‌నం అని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని.. చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి పోల‌వ‌రం అంటూ టూర్లు వేస్తున్నారే త‌ప్ప సూప‌ర్ సిక్స్ ఎప్పుడు అమ‌లు చేస్తామో చెప్ప‌లేడంలేద‌ని తెలిపారు.