Kishan Reddy: MIM సీటును సైతం BJP కొట్టాలి

Kishan Reddy: యావత్ ప్రపంచానికి నాయకుడిగా ప్రపంచ చిత్రపటంలో భారత్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపేలా భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారని అన్నారు BJP రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. నీతివంతమైన, సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నరేంద్ర మోదీ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు.

“”” మోదీజీ మూడోసారి BJP ప్రభుత్వం ఏర్పడేలా దేశ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి విచ్చేశారు. గతంలో కూడా ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించారు. మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 కు 17 కు సీట్లు గెలిచేలా మద్దతు తెలపాలని కోరుతున్నాం. హైదరాబాద్ లో MIM సీటును సైతం బీజేపీ కైవసం చేసుకునేలా ఆశీర్వదించాలి. తెలంగాణలో BRS పార్టీ ఉనికి లేదు. పదేళ్ల KCR పాలనలో అవినీతి, అహంకార, నియంతృత్వ పాలన చూశాం. అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు ఆ హామీలు అమలయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప.. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైన ఎజెండా లేదు. రైతులకు రైతుబంధు పెంచుతామని హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అ హామీల్ని నెరవేర్చలేదు “””” అని కిష‌న్ రెడ్డి అన్నారు.