BJP: ప్రెసిడెంట్‌గా కిష‌న్‌.. కేంద్ర స‌హాయ మంత్రిగా సంజ‌య్

Hyderabad: BJP తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి మంత్రి కిష‌న్ రెడ్డిని (kishan reddy) వ‌రించింది. కొన్ని రోజులుగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చించిన హై క‌మాండ్.. BJP రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని కిష‌న్ రెడ్డికి ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు అధ్య‌క్షుడిగా కొన‌సాగిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు (bandi sanjay) కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇచ్చింది. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్‌కు (etela rajender) BJP ఎన్నిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ పోస్ట్‌ను ఇచ్చింది. కాసేప‌ట్లో BJP ప్ర‌క‌టన విడుద‌ల చేయ‌నుంది.