కాంగ్రెస్‌పై కిష‌న్ రెడ్డి సెటైర్.. పొన్నం ప్ర‌భాక‌ర్ కౌంట‌ర్

Kishan Reddy indirect counter to congress party

Kishan Reddy: విమర్శించుకుందాం కానీ ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడకండి అని పిలుపునిచ్చారు BJP నేత కిష‌న్ రెడ్డి. నాయకుల ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు కానీ.. ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యమ‌ని అన్నారు.
పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ‌ను ఉద్దేశిస్తూ కిష‌న్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేసారు.

కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కౌంట‌ర్ వేసారు. “” రాజకీయాల్లో భాష ముఖ్యం.. వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరం. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలి “” అని ఆయ‌న కిష‌న్‌కు చుర‌క‌లంటించారు.