Kiran Royal: ప్ర‌జ‌లు భ‌యంతో ఓటేసారు.. YCP నేత‌ల‌కు అస్సాం టికెట్లు రెడీ

kiran royal says assam tickets are ready for ysrcp leaders

Kiran Royal: తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు ప్ర‌జ‌ల‌కు భ‌యంతో ఓటేసార‌ని అన్నారు జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయల్ తెలిపారు. మ‌ళ్లీ అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ వ‌స్తే ఎక్క‌డ త‌మ జీవితాలు పూర్తిగా నాశ‌నం అయిపోతారో అన్న భ‌య‌మే కూట‌మిని గెలిపించింద‌ని అన్నారు. ఇక ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకుని మ‌ర్యాద‌గా న‌డుచుకోవాల‌ని.. అలా కాకుండా సోషల్ మీడియాలో త‌మ‌పై ట్రోలింగ్ వంటివి చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని అన్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌మ‌ను చూసి ఓర్వ‌లేక‌పోతే.. నేత‌లంద‌రికీ త‌న డ‌బ్బుల‌తో అస్సాంకి టికెట్లు బుక్ చేసాన‌ని.. ఈరోజు సాయంత్రం విజ‌య‌వాడ నుంచి అస్సాంకు ట్రైన్ ఉంద‌ని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు అర్హ‌త‌ను బట్టి టికెట్ బుక్ చేసాన‌ని ఎద్దేవా చేసారు. మాజీ ఎమ్మెల్యే రోజా ఎప్పుడైతే తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నాక గెలుపు త‌మ‌దే అని చెప్పిందో అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోబోతోంద‌ని త‌మ‌కు క్లియ‌ర్‌గా అర్థ‌మైంద‌ని అన్నారు.