Kiraak RP: రోజా రాత్రంతా తాగి ఏదేదో మాట్లాడుతోంది

kiraak rp says rk roja drunk and talking nonsense

Kiraak RP: వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రోజా రాత్రంతా తాగి ఏదేదో వాగుతోంద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ నేత కిరాక్ ఆర్పీ. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్ర‌జ‌లు అల్లాడిపోతుంటే చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. పిల్ల‌ల‌కు పాలు.. పెద్ద‌ల‌కు తిండి, వృద్ధుల‌కు మందులు లేవ‌ని ఆరోపించారు. ఈ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల‌దించుకోవాల‌ని అన్నారు.

దీనిపై కిరాక్ ఆర్పీ ఘాటుగా స్పందించారు. “” ఏమే రోజా.. రాత్రంతా తాగి కింద స్క్రిప్ట్ పెట్టుకుని పొద్దున్నే హ్యాంగోవ‌ర్‌లో ఏదేదో మాట్లాడుతున్నావా? కోవిడ్ స‌మ‌యంలో మా అత్తగారు ఆవ‌కాయ ఎలా పెట్టాలో నేర్పారు అంటూ తెగ లొట్ట‌లేసుకుంటూ తిన్నావ్ క‌దా. విజ‌య‌వాడ ప్ర‌జ‌ల కోసం అదే ఆవ‌కాయ అన్నమో ఇడ్లీలో పులిహార పొట్లాలో పంప‌లేక‌పోయావే? ఏడు ప‌దుల వ‌య‌సులో చంద్ర‌బాబు నాయుడు ప‌గ‌లు రాత్రి అనేది లేకుండా ప్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 6 కోట్ల మేర విరాళం ఇచ్చారు. నువ్వు మీ అన్న జగ‌న్ ఆ బొచ్చు (బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌) ఏమిచ్చారు? నువ్వు ఇలా రెచ్చిపోయి నోటికొచ్చింది మాట్లాడ‌తావ్ కాబ‌ట్టే న‌గ‌రి ప్ర‌జ‌లు చెప్పుతో కొట్టి ఓడించారు “” అంటూ రెచ్చిపోయారు.