BRS: ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తం..ఒకరి మృతి

khammam – ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఇవాళ నిర్వహించిన బీఆర్‌ఎస్‌(BRS) ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తున్న తరుణంలో పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఈ నిప్పురవ్వలు కాస్త పక్కనే ఉన్న పూరి గుడిసెపై పడి దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో.. ఒకరు అక్కడికక్కడే మరణించగా… మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దాదాపు పది మందికి గాయాలు అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో అక్కడున్నవారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉరుకులు, పరుగులు తీశారు.