Kethi Reddy: 160 సీట్లు వ‌స్తాయ‌ని అశ్వినీద‌త్‌కి ఎలా తెలుసు?

kethi reddy says ap election results are scripted

Kethi Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు స్క్రిప్ట్ రాసిన‌ట్లు ఉన్నాయ‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి. ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీద‌త్ ఎప్ప‌టి నుంచో తెలుగు దేశం పార్టీ కూట‌మికి దాదాపు 160 సీట్లు వ‌స్తాయ‌ని చెప్తూ వ‌చ్చార‌ని.. అస‌లు ఎలాంటి గ్రౌండ్ రీసెర్చ్ చేయ‌కుండా ఆయ‌న అంత క‌చ్చితంగా ఎలా చెప్ప‌గ‌లిగార‌ని ప్ర‌శ్నించారు. ఓట్ల కౌంటింగ్ రోజు ఉద‌యం 10:30 క‌ల్లా అంద‌రూ వెళ్లిపోయార‌ని.. ఆ త‌ర్వాత తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు కావాల్సిన మెజారిటీలు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు క‌చ్చితంగా ప్లాన్ చేసిన‌వే అని ఆయ‌న ఆరోపిస్తున్నారు.