KCR: ఎర్ర‌బెల్లిని గెలిపించి అప్పుడు విజిల్స్ వేయండి..!

Telangana Elections: తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి KCR పాల‌కుర్తిలో ఏర్పాటుచేసిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పాల‌కుర్తి నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు (errabelli dayakar rao) పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే KCR ప్రసంగం మొద‌లుకాగానే జ‌నాలు విజిల్స్ వేయ‌డం మొద‌లుపెట్ట‌డంతో ఎర్ర‌బెల్లిని గెలిపించాక విజిల్స్ వేయాల‌ని ఇప్పుడు వేస్తే లాభం లేద‌ని అన్నారు. ఎర్ర‌బెల్లిని గెలిపిస్తే చెక్ డ్యాంలు, ఇంజినీరింగ్ కాలేజ్‌లు త్వ‌ర‌గా ఏర్పాటుచేసే బాధ్య‌త తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.